Showing posts with label andhra news. Show all posts
Showing posts with label andhra news. Show all posts

Tuesday, 6 April 2021

Revised Electric Traffic A P Govt - విద్యుత్ కొత్త టారిఫ్ ఆర్డర్ ను విడుదల. చేసిన రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి

 విద్యుత్ కొత్త టారిఫ్ ఆర్డర్ ను విడుదల. చేసిన రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి చైర్మన్ జస్టిస్ సివి నాగార్జున రెడ్డి




గృహ అవసరాలకు మూడు కేటగిరి లు గా వినియోగదారుల విభజన.


A.గ్రూప్ 

75 యూనిట్ ల కంటే తక్కువవినియోగదారులు. 0-50 యూనిట్ కి రూ.1.45 


51-75 యూనిట్ లకు 

రూ.2.60


B.గ్రూప్ 

75 నుంచి 225 యూనిట్ల వినియోగం


0-50 వరకు రూ.2.60 


51-100 రూ.2.60


101-200 రూ.3.60


201-225 రూ.6.90


C. గ్రూప్

225 యూనిట్ల పైబడిన వినియోగదారులు.


0-50 రూ.2.65


51-100 రూ.3.35


101-200 రూ.5.40


201-300 రూ.7.10


301-400 రూ.7.95


401-500 రూ.8.50


500 యూనిట్లకు మించి రూ.9.90


గృహ వినియోగ దారునికి ఇకపై కనీస చార్జీలు ఉండవు.


ఆ స్థానంలో ఒక కిలో వాట్ కి పది రూపాయలు ఛార్జ్


ఫంక్షన్ హాళ్లకు కూడా ఇకపై నిర్దిష్ట చార్జీలు ఉండవు.


500 యూనిట్ లకు మించి వినియోగించే వారికి స్మార్ట్ మీటర్లు ఆప్ట్ చేసుకునే అవకాశం.

Wednesday, 3 March 2021

జులై 12 నుంచి ఎంసెట్‌AP EAMCET 2021 - Exam Date

 జులై 12 నుంచి  ఎంసెట్‌


బైపీసీ స్ట్రీమ్‌ 19, 20 తేదీల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం

* అమరావతి:*

 ఏపీ ఎంసెట్‌ జులై 12 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లు, పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఎంసెట్‌ నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూ కాకినాడకు అప్పగించారు. జులై 12 నుంచి 15 వరకు ఇంజినీరింగ్‌ పరీక్షను నిర్వహిస్తారు. నాలుగు రోజులపాటు 8 విడతలుగా పరీక్ష ఉంటుంది. బైపీసీ స్ట్రీమ్‌ విద్యార్థులకు 19, 20వ తేదీల్లో 2 రోజులపాటు నాలుగు విడతలుగా పరీక్ష నిర్వహిస్తారు. దీని తర్వాత ఈసెట్‌ నిర్వహించనున్నారు. పాలిటెక్నిక్‌ పరీక్షల తేదీలు ఖరారు కానందున ఈ తేదీలపై ఇంకా స్పష్టత రాలేదు. చివరి సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూలును పంపించాలని సాంకేతిక విద్యాశాఖను ఉన్నత విద్యామండలి కోరింది.


మిగతా పరీక్షల్లో కొంత జాప్యం

ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనందున ఆగస్టు 6 వరకు డిగ్రీ విద్యార్థులకు తరగతులను నిర్వహించనున్నారు. అనంతరం సెమిస్టర్‌ పరీక్షలుంటాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ పరీక్షల షెడ్యూలును అనుసరించి ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబరు మొదటి వారం నుంచి ఐసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌ లాంటివి నిర్వహించనున్నారు. డిగ్రీ పరీక్షల ఫలితాల అనంతరం కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. ఆగస్టులో సెమిస్టర్‌ పరీక్షలు పూర్తయినా ఫలితాలు వచ్చేందుకు నెల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో అక్టోబరులో కౌన్సెలింగ్‌ నిర్వహించాలని భావిస్తున్నారు.


ఆంధ్ర వర్సిటీకి మూడు సెట్‌ల బాధ్యతలు

ఎంసెట్‌ కన్వీనర్‌గా జేఎన్‌టీయూ కాకినాడ ప్రొఫెసర్‌ రవీంద్రను రెండోసారి నియమించారు. మొత్తం ఏడు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఉండగా, 3 ప్రవేశ పరీక్షల బాధ్యతలను ఆంధ్ర వర్సిటీకి అప్పగించారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఛైర్మన్లుగా వ్యవహరించనున్నారు.