Wednesday, 3 March 2021

కమ్యూనిస్టుల గెలుపు అభివృద్ధికి మలుపు


కమ్యూనిస్టుల గెలుపు అభివృద్ధికి మలుపు 


. సిపిఐ రాష్ట్ర  కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య పిలుపు.  


సామర్లకోట మార్చి 4 :ఒక్క ఓటు కమ్యూనిస్టు పార్టీకి వేయడం ద్వారా స్వచ్ఛమైన పాలనకు అభివృద్ధికి అభివృద్ధికి మలుపు గా ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య పిలుపునిచ్చారు గురువారం ఉదయం స్థానిక పదో వార్డు లో సప్త సూర్య  రామ కుమారి కి మద్దతుగా ఆయన  ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపాక మధు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నక్క కిషోర్  జి లోవ రత్నం సామర్లకోట పట్టణ కార్యదర్శి పేదిరెడ్ల సత్యనారాయణ ఉన్నారు. ఈ సందర్భంగా రావుల వెంకయ్య మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో సిపిఐ గెలుపు అంటే ప్రజాస్వామ్యానికి గెలుపుని రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాస్తున్నారని వర్గ వైరుధ్యాలతో స్థానిక సంస్థల్లో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ కొన్నిచోట్ల గెలుపు కోసం సారా,  డబ్బు యథేచ్ఛగా మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెడుతున్నారని ప్రజాస్వామ్యాన్ని ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేస్తున్నారని ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థుల గెలుపు అనివార్యమని అటువంటి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను కంకి కొడవలి గుర్తు పై ఓటు వేసి గెలిపించ వలసిందిగా మున్సిపాలిటీలో తమ వాణిని వినిపించేందుకు గాను కమ్యూనిస్టు అభ్యర్థిని సూర్యకుమారి గారికి కంకి కొడవలి ఓటు వేయడం ద్వారా మున్సిపాలిటీ లో అవకాశం కల్పించాలని సిపిఐ పార్టీ తరఫున ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాము. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఎలిశెట్టి రామదాసు, ఏఐటీయూసీ నాయకులు కామిరెడ్డి బోడకొండ, ప్రజానాట్యమండలి కళాకారులు పేదిరెడ్ల అర్జున్ రావు, అల్లూరు భద్�

చిన్నచిన్న తగాదాలకు విడాకులు తగదు

 చిన్నచిన్న తగాదాలకు విడాకులు తగదు

 సమాజ శ్రేయస్సు దృష్ట్యా చిన్నచిన్న తగాదాలతో భార్య భర్తలు విడాకులు కోరడం తగదని న్యాయవాది పి. ఏసుబాబు పేర్కొన్నారు. లలిత నగర్ కాలనీ లో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన  అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఏమైనా  భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వస్తే...  వాటిని పెద్ద వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి అన్నారు. అలా వీలుకాని పక్షంలో కోర్టులలో ఉండే న్యాయసేవాధికార సంస్థ దృష్టికి తీసుకు వస్తే సామరస్యపూర్వకంగా ఇరువురికి నచ్చజెప్పి తగురీతిలో న్యాయ సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అచట భార్య భర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు పెంపొందడానికి కృషి చేస్తారన్నారు. అంతకు ఇద్దరి మధ్య పరిష్కారం కుదరకపోతే మహిళల తరఫున న్యాయసేవాధికార సంస్థ ఉచితంగా న్యాయ సహాయం అందిస్తుందని యేసు బాబు తెలిపారు. సంఘ అధ్యక్షులు సుబ్రహ్మణ్య రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో  వాకర్స్ ప్రాంతీయ కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్, మురళి ,కే శ్రీ రామ రాజు తదితరులు పాల్గొన్నారు.



త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ను ఐక్య ఉద్యమం కాపాడుకుందాం...

 


త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ను ఐక్య ఉద్యమం కాపాడుకుందాం...

...సిఐటియు విస్తృత సమావేశం పిలుపు...


కాకినాడ, మార్చి 3; ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అశేష ప్రజల పోరాటాలతో , 32 మంది ప్రాణ త్యాగం తో సాధించుకున్న విశాఖ ఉక్కు ను నేటి తరం ఐక్య ఉద్యమం లో కాపాడుకోవాలని సిఐటియు కాకినాడ నగర విస్తృత సమావేశం పిలుపు నిచ్చింది.

బుధవారం సాయంత్రం స్థానిక యుటిఎఫ్ టీచర్స్ హోం లో జి. కామశాస్త్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. పోరాటాలు, త్యాగాలతో పాటు 68 గ్రామాల ప్రజలు 22 వేల ఎకరాల భూమిని అందించడం వల్ల విశాఖ ఉక్కు సాకారమైందన్నారు. 68 మంది వామపక్షాల ఎమ్మెల్యే లు, ఎంపీలు రాజీనామా లు చేసి పోరాడిన చరిత్ర ఉందన్నారు. సుమారు 2.5 లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు పరిశ్రమ ను కొరియా కు చెందిన పోక్సో అనే కంపెనీ కి కారుచౌకగా కట్టబెట్టడానికి కేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా ఇప్పటికే చాలా అన్యాయం చేసారని పేర్కొన్నారు. తాజాగా దేశంలో నవరత్న హోదా కలిగి, లక్షా యాభై వేల మంది కి ప్రత్యక్షం గా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ను దెబ్బకొడితే చూస్తూ ఊరుకోమన్నారు. దేశరాజధాని లో జరుగుతున్న రైతుల పోరాటం మోడీ దూకుడు కు కళ్ళెం వేసిందన్నారు. ఆ ఉద్యమ స్ఫూర్తి తో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ ఉద్యమం గా సాగాలన్నారు. ఈ ఉద్యమం లో సిఐటియు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు ముందు వరుసలో నిలబడాలన్నారు. ప్రజలంతా ఈ ఉద్యమానికి అండగా నిలవాలని, మార్చి 5 రాష్ట్ర బంద్ జయప్రదం చేయాలని పిలుపు ఇచ్చారు. 

సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ మార్చి 14 న జరుగబోతున్న తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాబ్జీ షేక్ గారిని గెలిపించుకోవడానికి కృషి చేద్దామన్నారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా సీనియర్ నేత దువ్వ శేషబాబ్జీ, జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రమళ్ళ పద్మ, జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకట రమణ లతో పాటు సి.వెంకట్రావు, సిహెచ్. విజయ్ కుమార్, ఎం. రమణమ్మ, పద్మ, పాప, భారతి, తుపాకుల వీర్రాజు, గాంధీ, అర్జున్, నవీన్, బంగారు రామకృష్ణ, బండి గోపి, వర్రే రమణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు...

విశాఖ ఉక్కు పరిరక్షణ కొరకు 

 రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయాలని 

సిపిఐ —ఏఐటీయూసీ ప్రదర్శన 


బంద్ తో మోడీకి గుణపాఠం రావాలి 


సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు 


మార్చి03:విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని దాని పరిరక్షణ కొరకు బంద్ జయప్రదం చేయాలని అదేవిధంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కొరకు కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు 5 న జరిగే రాష్ట్ర బంద్కు వామపక్షాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు .


బుధవారం ఉదయం రాజమండ్రి లో మెయిన్ రోడ్ లో ప్రదర్శన నిర్వహించారు 


ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 20 రోజులుగా విశాఖ ఉక్కు పరిరక్షణ కొరకు  పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న మోడీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు 


 రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసిన కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడం అన్యాయమన్నారు .ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష విశాఖ ఉక్కు అలాంటి విశాఖ ఉక్కు కోసం 32 మంది విద్యార్థుల రక్తతర్పణం తో స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని త్యాగధనులతో నిర్మించిన విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని అందుకే ఐదో తేదీన జరిగే రాష్ట్ర బంద్ కు వామపక్షాలు పూర్తి మద్దతు ఇస్తున్నాయని జిల్లాలో ఉన్న వర్తక వాణిజ్య విద్యాసంస్థలు థియేటర్స్ పరిశ్రమలు అందరూ సహకరించాలని వారు పిలుపునిచ్చారు .


సిపిఐ నగర కార్యదర్శి నల్ల రామారావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రేవిటీకరణ చాల హేయమైన చర్య అని అన్నారు .ప్రేవిటీకరణ ఆపకపోతే మరో చరిత్రతక పోరాటం చేస్తామని అన్నారు .రాష్ట్ర బంద్ కు అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలన్నారు 


జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ ఈ బంద్కు మిగతా రాజకీయ పార్టీ నాయకులు కలిసి రావాలని వారు కోరారు 


ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నక్క కిషోర్ ,యూనియన్ ప్రధాన కార్యదర్శి సప్ప రమణ ,ఉపాధ్యక్షులు పెంట దేవుడు ,వెంకట్రావు ,సహాయ కార్యదర్శి రోగుల మోహన్ కృష్ణ ,రెడ్డి వెంకట్ రావు కోశాధికారి కాళ్ళ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు


ఛాంబర్ అఫ్ కామర్స్ వారు ఉక్కు పరిరక్షణ కొరకు చేస్తున్న రాష్ట్ర బంద్


 ఛాంబర్ అఫ్ కామర్స్ వారు ఉక్కు పరిరక్షణ కొరకు చేస్తున్న రాష్ట్ర బంద్ కు మద్దతు తెలపడాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నల్ల రామారావు అభినందనలు తెలియచెసారు .కార్మిక వర్గానికి అండగా ఉన్నందుకు వ్యాపార వర్గానికి ధన్యవాదములు వామపక్ష నాయకులూ ,కార్మిక సంఘాలు అన్నారు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ... జిల్లా కలెక్టర్ పి సి పాయిం

 తూర్పుగోదావరి జిల్లా కాకినాడ...

 జిల్లా కలెక్టర్ పి సి పాయింట్స్...


 జిల్లా ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంతృప్తిని వ్యక్తం చేశారు...


 జిల్లాలోని నాలుగు విడతల్లో 34 వార్డులలో నామినేషన్ లేకపోవడం వలన మరల ఎన్నికల నిర్వహణ నిర్వహిస్తున్నాం...


 6వ తేదీన ఎన్నికల నామినేషన్, 7 వ తేదీన స్కూటీని, 8 వ తేదీన విత్ డ్రాలు, 10 తేదీన  ఎన్నికలు నిర్వహిస్తాం...


 34 వార్డు లో ఇప్పటికే సమాచారాన్ని అందించాం...


 ఉదయం నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తాం, అదేరోజు సాయంత్రం ఎన్నికలు ఫలితాలు ప్రకటిస్తాం...


 రబీ పంటకు సంబంధించి డిస్టిక్ అడ్వైజరీ బోర్డు లో ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, అగ్రికల్చర్ సంబంధిత అధికారులతో ప్రతివారం సమావేశం నిర్వహిస్తున్నాం...


 రైతుల లో ఉన్న అపోహలు తొలగించేందుకే ఫీల్డ్ విజిట్ లు చేస్తున్నాం...




 జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి పి సీ పాయింట్..


 మొదటి విడతలో కోవిడ్ వ్యాక్సినేషన్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ లకు, రెండో విడతలో రెవెన్యూ, పోలీసులకు, మూడో విడతలో ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఆరోగ్యశ్రీ ఉన్న ప్రతి ప్రైవేటు ఆసుపత్రులలో  250 రూపాయలు కట్టి వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు...


 జనరల్గా కాకుండా covid-19 వెబ్సైట్లో కూడా   రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని తెలిపారు....


 45 నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న వారు ప్రతి ఒక్కరు వారికి ఉన్న ఇబ్బందులను డాక్టర్లు చెప్పి వ్యాక్సిన్ వేయించుకోవాలి....


 65 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరూ ఏదైనా గుర్తింపు పొందిన కార్డు పట్టుకొని వెళ్ళవలెను...


East Godavari joint Collector(W) Smt G. Raja Kumari, I. A. S., Inspected 1) Gram Sachivalayam 1, 2 and 3 of Vetlapalem (V), Samalkot (M)

 East Godavari joint Collector(W) Smt G. Raja Kumari, I. A. S., 

Inspected

1) Gram Sachivalayam 1, 2 and 3 of Vetlapalem (V), Samalkot (M) Today, Conducted Review on Beyond SLA services, YSR Bima, Aasara, Cheyutha, etc., Interacted with Sachivalayam Functionaries. 

2) Visited to SBI, Vetlapalem along with PD, DRDA, JD Animal Husbandry & staff and Verified the Milch Animals Loaning process at Bank under YSR Cheyutha



Joint Collector(W) Smt G. Raja Kumari, I. A. S., madam inspected APSWRS Social Welfare Res School at Pithapuram


Joint Collector(W) Smt G. Raja Kumari, I. A. S., madam inspected APSWRS Social Welfare Res School at Pithapuram.. Interacted with Students, Observed Facilities, Had lunch with Students on 02-03-2021. Tahsildar, Principal and RI Pithapuram attended. #APSWRSSocialWelfare  #APSWRS #socialwelfare  #pithapuram #rajakumari 

#jointcollectorrajakumari 

#jointcollector  #eastgodvaricollector #eastgodavari #ripithapuram #eastgodavaridist



జులై 12 నుంచి ఎంసెట్‌AP EAMCET 2021 - Exam Date

 జులై 12 నుంచి  ఎంసెట్‌


బైపీసీ స్ట్రీమ్‌ 19, 20 తేదీల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం

* అమరావతి:*

 ఏపీ ఎంసెట్‌ జులై 12 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లు, పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఎంసెట్‌ నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూ కాకినాడకు అప్పగించారు. జులై 12 నుంచి 15 వరకు ఇంజినీరింగ్‌ పరీక్షను నిర్వహిస్తారు. నాలుగు రోజులపాటు 8 విడతలుగా పరీక్ష ఉంటుంది. బైపీసీ స్ట్రీమ్‌ విద్యార్థులకు 19, 20వ తేదీల్లో 2 రోజులపాటు నాలుగు విడతలుగా పరీక్ష నిర్వహిస్తారు. దీని తర్వాత ఈసెట్‌ నిర్వహించనున్నారు. పాలిటెక్నిక్‌ పరీక్షల తేదీలు ఖరారు కానందున ఈ తేదీలపై ఇంకా స్పష్టత రాలేదు. చివరి సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూలును పంపించాలని సాంకేతిక విద్యాశాఖను ఉన్నత విద్యామండలి కోరింది.


మిగతా పరీక్షల్లో కొంత జాప్యం

ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనందున ఆగస్టు 6 వరకు డిగ్రీ విద్యార్థులకు తరగతులను నిర్వహించనున్నారు. అనంతరం సెమిస్టర్‌ పరీక్షలుంటాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ పరీక్షల షెడ్యూలును అనుసరించి ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబరు మొదటి వారం నుంచి ఐసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌ లాంటివి నిర్వహించనున్నారు. డిగ్రీ పరీక్షల ఫలితాల అనంతరం కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. ఆగస్టులో సెమిస్టర్‌ పరీక్షలు పూర్తయినా ఫలితాలు వచ్చేందుకు నెల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో అక్టోబరులో కౌన్సెలింగ్‌ నిర్వహించాలని భావిస్తున్నారు.


ఆంధ్ర వర్సిటీకి మూడు సెట్‌ల బాధ్యతలు

ఎంసెట్‌ కన్వీనర్‌గా జేఎన్‌టీయూ కాకినాడ ప్రొఫెసర్‌ రవీంద్రను రెండోసారి నియమించారు. మొత్తం ఏడు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఉండగా, 3 ప్రవేశ పరీక్షల బాధ్యతలను ఆంధ్ర వర్సిటీకి అప్పగించారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఛైర్మన్లుగా వ్యవహరించనున్నారు.

Dist Collector D.Muralidhar Reddy @ Sachavalayam Staff at Golilla Peta, Jagannaickpur, Kakinada

 Dist Collector D.Muralidhar Reddy inspected 14A-14B Ward m on service requests,  Register books and interacted  Sachavalayam Staff at Golilla Peta, Jagannaickpur, Kakinada on 03-03-2021. Kkd Municipal commissioner and MHO participated. #Municipalcommissioner  #kakinda #kakinadmucipalcorporation #distcollector #DMuralidhar Reddy #CollectorDMuralidharReddy #SachavalayamStaff #Sachavalayam  #kkdmuncipal 




టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక..

 టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక...


కాకినాడ, మార్చి 2; ది. కాకినాడ టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) నూతన కమిటీ ఎన్నిక జరిగింది.

మంగళవారం ఉదయం స్ధానిక సిఐటియు కార్యాలయం లో యూనియన్ సర్వసభ్య సమావేశం వాలిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. యూనియన్ కార్యదర్శి పి. రమేష్ గత కార్యక్రమాలు ప్రవేశ పెట్టారు.  ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ కరోనా లాక్ డౌన్ సమయంలో తొలి సారిగా తమ సభ్యులను ఆదుకొనే కార్యక్రమం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన సవరణ చట్టం తెచ్చి ట్రాన్స్ పోర్ట్ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. దాని వల్ల భారీగా చలానా ఫీజులు, అపరాధ రుసుములు వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే దేశం ఒకే పన్ను పేరుతో మందులను కూడా జి.ఎస్.టి.పరిధి లోకి తెచ్చిన కేంద్ర పాలకులు పెట్రోల్ డీజిల్ లను ఎందుకు జి.ఎస్.టి. పరిధిలోకి తీసుకురాలేదని ప్రశ్నించారు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, దీనివల్ల ట్రాన్స్ పోర్ట్ వాహనాలు తరచూ రిపేర్ కు వస్తున్నాయని పేర్కొన్నారు. మరొకవైపు స్పేర్ పార్ట్ ల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. దీనివల్ల ట్రాన్స్ పోర్ట్ కార్మికుల జీవనం భారంగా మారుతోందన్నారు. అందువల్ల పాలకులు, అధికారులు ట్రాన్స్ పోర్ట్ రంగ కార్మికులపై భారాలు మోపే విధానాలు ఆపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా కర్రి శ్రీనివాస్ అధ్యక్షుడు గా, శీలి లక్ష్మణ్ ఉపాధ్యక్షుడు గా, కె. వీరబాబు కార్యదర్శి గా, ప్రేమ్ కుమార్ సహాయ కార్యదర్శి గా, హేమ కుమార్ కోశాధికారి గా నూతన కమిటీ ఎన్నిక అయ్యింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకట రమణ, కె. సత్తిబాబు లతో పాటు బాబూరావు, రాఘవ, మూర్తి, భాషా తదితరులు పాల్గొన్నారు...'''












సెల్ఫోన్లతో వినికిడి సమస్యలు ఈ రోజుల్లో - ప్రముఖ ఈ ఎన్ టి వైద్యులు డాక్టర్ గుబ్బల లక్షణ ప్రసాద్

 సెల్ఫోన్లతో వినికిడి సమస్యలు ఈ రోజుల్లో సెల్ ఫోన్ వాడని వారు లేరంటే అతిశయోక్తి కాదని కానీ వీటి వలనే రోజు రోజుకి వినికిడి సమస్యలు అధికమవుతున్నాయి  అని ప్రముఖ   ఈ ఎన్ టి వైద్యులు డాక్టర్ గుబ్బల లక్షణ  ప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేట ఆదర్శ వృద్ధుల ఆశ్రమంలో  బోట్ క్లబ్ వాకర్స్ సంగం ఆధ్వర్యంలో ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శక్తివంతమైన స్మార్ట్ఫోన్లలో ఎక్కువ సేపు మాట్లాడటం వలన వాటినుండి   అధిక రేడియేషన్ విడుదలై వినికిడి లోపం వస్తుందన్నారు. ఆధునిక జీవనశైలి ,పోషకాహార లోపం, మానసిక ఒత్తిళ్లు కూడా వినికిడి పై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. దీని నివారణకు గాను ఎక్కువ సమయం సెల్ఫోన్లలో  మాట్లాడ రాదన్నారు. చెవిలో నూనె వేయడం , ఇతర వస్తువులు పెట్టి  చెవిలో తిప్ప రాదని డాక్టర్ లక్ష్మణ్ ప్రసాద్ తెలిపారు. అనంతరం హియరింగ్ కేర్ సెంటర్ ఆడియాలజిస్టు ఎన్ శ్రీను నాయక్ వినికిడి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వాకర్స్ సంఘ జిల్లా కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ గుబ్బల లక్ష్మన్న ప్రసాద్ , ఎన్ శ్రీను నాయక్ లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రేలింగి బాపిరాజు, డి సుబ్రహ్మణ్యం, రాజా, పీ. త్రినాథ్, శ్రీ వాణి, కొండలరావు తదితరులు పాల్గొన్నారు .



#ent #entdr #entdrkakinada #kakinada #kainadanews

జాతీయ నులుపురుగుల నివారణక దినోత్సవం




ఈ రోజు   నివారణ నిమిత్తం 1సంవత్సరం నుండి 19 సంవత్సరం లలోపు పిల్లల కు మాత్రలు పంపిణీ చేసిన రాష్ట్ర కార్యదర్శి లింగంరవి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ANM హేమ వారి సిబ్బంది వారితో పాటుగా జిల్లా బిసి సెల్ కార్యదర్శి కొత్తపల్లి గిరీష్ పంచాయతీ కార్యదర్శి వెంకట రెడ్డి గారు తదితర నాయకులు #kakianda #kakinadacity #kakinadanews #kainadanewsupdates #doctorsadvice #kakinadadoctor #news  #ratnaprasadkakinada


 చిగుళ్ల వ్యాధి ని అశ్రద్ధ చేయరాదు  మనం తీసుకునే ఆహారం జీర్ణం కావాలంటే దంతాలు ముఖ్యం కాబట్టి చిగుళ్ల వ్యాధి వస్తే  వెంటనే వైద్యుల్ని సంప్రదించి సహజ దంతాలను కాపాడుకోవాలని ప్రముఖ దంత వైద్యులు డాక్టర్  సువర్ణ రాజు పేర్కొన్నారు. సర్పవరం గ్రామంలో ఆ గ్రామ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన  ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మెనోపాజ్ దశలో  మహిళలను చిగుళ్ల సమస్యలు వేధిస్తాయి అన్నారు. ఈ దశలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తక్కువ స్థాయిలో విడుదలవుతుందని తద్వారా నోరు పొడిబారి దుర్వాసన వస్తుంది అన్నారు. దీనిని అధిగమించడానికి ప్రతిరోజు రెండుసార్లు బ్రష్ చేయాలని  డాక్టర్ సువర్ణ రాజు తెలిపారు.   సంఘ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వాకర్స్ ప్రాంతీయ కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్, సంఘ సభ్యులు, వాకర్స్ పాల్గొన్నారు


#kakianda #kakinadacity #kakinadanews #kainadanewsupdates #doctorsadvice #kakinadadoctor #news  #ratnaprasadkakinada

ప్రముఖ మానసిక విశ్లేషకులు డాక్టర్ ఏ పి జి విను - Happiness is the key for Success - Psychologist A PJ Vinu @ NSS Camp

 ప్రతినిత్యం ఆనందంగా గడపాలి ప్రతి ఒక్కరూ ప్రతి నిమిషం ఆనందంగా, సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలని  ప్రముఖ మానసిక విశ్లేషకులు డాక్టర్  ఏ పి జి విను పేర్కొన్నారు. రమణయ్యపేట కొత్తూరు లో స్వామి జూనియర్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక  శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మనిషి జీవితంలో ప్రతిక్షణం విలువైనది అన్నారు. జీవితంలో సమస్యలు సహజమని అయితే ఆనందమే జీవిత పరమావధి కాబట్టి విద్యార్థి దశలో చక్కగా విద్య అభ్యసిస్తూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ప్రేమ, ఆప్యాయతను పంచుకుంటూ ఆనందంగా జీవించాలని  అన్నారు. చదువును కష్టంగా కాకుండా  ఇష్టంగా చదవాలన్నారు. వ్యతిరేక ఆలోచనలు రానివ్వకుండా ఎప్పుడు సానుకూల దృక్పథంతో మెలగాలని విను తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజకుమార్, మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారి , వాలంటీర్లు పాల్గొన్నారు.



#kakianda #kakinadacity #kakinadanews #kainadanewsupdates #nssunit #nssswamycollege #nssnews #psychologistapjvinu #vinu #apjvinu #ratnaprasadkakinada