Showing posts with label kakianda news. Show all posts
Showing posts with label kakianda news. Show all posts

Saturday, 13 March 2021

MLC Elections @ Kakinada Live update 2021






 MLC Elections @ Kakinada Live update 2021

Thursday, 11 March 2021

Tyche Chemical Industries Two burnt alive and six injured after a fire at Sarpavaram of Kakinada of East Godavari district

 Tyche Chemical Industries 

Two burnt alive and six injured after a fire


కాకినాడ గ్రామీణం...

సర్పవరం గ్రామంలో గల టైకి కెమికల్ ఇండస్ట్రీస్ లో ఎయిర్ గ్యాస్ లీకైన సంఘటనలో ఇద్దరు వ్యక్తులు అక్కడిక్కడే మృతి...


 బిల్డింగ్ పైన చుట్టుపక్కల ఉన్న గోడ పగిలి రోడ్డుపై చెల్లాచెదురవ్వడంతో కంపెనీలో పని చేస్తున్న 6  ఉద్యోగులకు గాయాల పాలయ్యారు...

 క్షతగాత్రులను సమీప హాస్పిటల్ తరలింపు

భయాంధోళనలో సర్పవరం, భావన్నారాయణప్పాడు గ్రామస్తులు..!

టైకీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ లో ప్రమాదం సంఘటన!
మృతుల వివరాలు
1)
కాకర్ల సుబ్రహ్మణ్యం ( 31) తాల్లరేవు మండలం మల్లవరం గ్రామం
  
2) తోటకూర వెంకటరమణ  ( 37) తాల్లరేవు మండలం పటవల గ్రామం.

గాయాలు అయిన క్షతగాత్రులు :

1) కుడుపూడి శ్రీనివాసరావు (సాంబమూర్తి నగర్) కాకినాడ.
2)నమ్మి సింహాద్రిరావు (గంగానాపల్లి గ్రామం) కాకినాడ రూరల్
3) కలగ సత్య సాయిబాబు     
సీరియస్ గా ఉంది. (గంగానాపల్లి గ్రామం) కాకినాడ రూరల్,
4) రేగిల్లి రాజ్ కుమార్ (కట్టమూరు గ్రామం) పెద్దాపురం 

వీరంతా ఫ్యాక్టరీ లో ఆపరేటర్లు గా పని చేస్తున్నారు. ప్రస్తుతం మాధవపట్నం ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

టైకీ ఇండస్ట్రీలో ఘటన పై మంత్రి కన్నబాబు సమగ్ర విచారణ కు ఆదేశం.

Thursday, 4 March 2021

వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ రమణయ్యపేట లో కొప్పిశెట్టి సురేష్

 వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ      రమణయ్యపేట లో కొప్పిశెట్టి సురేష్ -అనిత దంపతుల సౌజన్యంతో పేద  కుటుంబానికి చెందిన వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త శిరీష మాట్లాడుతూ సృష్టిలో అన్ని జీవులకన్నా  మానవ జన్మ మహోత్కృష్టమైనదని దీనిని సార్థకం చేసుకోవడానికి గాను మానవసేవే మాధవ సేవగా సేవలు అందించాలన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణ మోహన్ మాట్లాడుతూ  సురేష్  అనిత  ల వివాహ దినోత్సవ సందర్భంగా వృద్ధులకు నూతన వస్త్రాలు సమకూర్చడం అభినందనలతో పాటు ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో  అంతర్జాతీయ వాకర్స్ సంఘ జిల్లా కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్, రేలంగి బాపిరాజు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.