Showing posts with label kakinada smart city. Show all posts
Showing posts with label kakinada smart city. Show all posts

Wednesday, 6 April 2022

Police identified by CC camera footage as the work of a man with no discernment.

 కాకినాడ సబ్ డివిజన్ కార్యాలయం, 

కాకినాడ  జిల్లా, ది:06.04.2022.


🔹కాకినాడ జిల్లా SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS., గారి స్వీయ పర్యవేక్షణ మరియు ఆయన జారీ చేసిన ఆదేశాల మేరకు అన్నమఘాటి, పద్మనాభ నగర్ శ్రీ కనక దుర్గమ్మ మరియు అభయాంజనేయ స్వామి ఆలయంలో రాతి విగ్రహాలు ధ్వంసం చేసిన కేసును చేధించిన పోలీసులు.


🔹విచక్షణా జ్ఞానo  లేని ఒక వ్యక్తి చేసిన పనిగా CC కెమేరాల దృశ్యాల ద్వారా గుర్తించిన పోలీసులు.


ది.04.04.2022 సమయంలో కాకినాడ I టౌన్ లా అండ్ ఆర్డర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అన్నమఘాటి సమీపంలో ఉన్నటువంటి పద్మనాభ నగర్ లో వేంచేసి ఉన్న శ్రీ కనక దుర్గమ్మ మరియు అభయాంజనేయ స్వామి ఆలయంలో  ఉన్నటువంటి  ఆంజనేయ స్వామి మూల విరాట్ యొక్క రాతి విగ్రహాలను  మరియు కనకదుర్గ ప్రవేశ ద్వారం వద్ద ఉన్న చండి ప్రచండ విగ్రహాలను పాక్షికంగా ధ్వంసం చేసి సమీపంలో ఉన్న మురికి కాలువలో పడవేయడం అదేవిధంగా ఆలయం ప్రక్కన ఉన్న తులసి కోట తలభాగం మరియు గుడి గోడపై ఉన్న ధాన్య లక్ష్మి బొమ్మను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంఘటనపై I టౌన్ పోలీస్ స్టేషన్ నందు Cr.No.63/2022 U/s 153(a) 295, 427 IPC గా కేసు నమోదు కాబడి దర్యాప్తును ప్రారంభించడం జరిగిన విషయం అందరికీ విధితమే.


ఈ కేసును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జిల్లా SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS, గారు కాకినాడ SDPO శ్రీ V.భీమారావు గారి పర్యవేక్షణలో కాకినాడ పట్టణంలో ఉన్న 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్, సర్పవరం  మరియు పోర్ట్ పోలీస్ స్టేషన్ ల Inspector లతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి SP గారి సమయానుకూల సూచనలు, ఆదేశాలకు అనుగుణంగా సదరు దర్యాప్తు బృందాలు రంగంలోనికి దిగి ఈ కేసును అతి తక్కువ సమయంలో వివిధ సాక్షుల వాంగ్మూలాలను మరియు CC కెమెరాల యొక్క సాంకేతికతను   ఉపయోగించి ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తిని గుర్తించడం జరిగింది.


ఇందులో అనుమానిస్తున్న  నిండుతుడు అర్ధరాత్రి సమయంలో ఈ ప్రాంతములో తిరుగుతూ ఉండే అలవాటు కలిగి ఉండి  4 వ తేదీ తెల్లవారు జామున సుమారు 12 గం. నుండి 1.30 గం. మధ్య సమయంలో ఈ కేసులో నేర స్థలం అయిన  శ్రీ కనక దుర్గ ఆలయం మరియు అభయాంజనేయ స్వామి ఆలయం వద్ద సంచరిస్తూ దేవత మూర్తులు ప్రతిమలను ఇష్టానుసారం తన పిచ్చి చేష్టలతో ధ్వంసం చేసి ఆలయం వెనుకనే ఉన్న మురుగు కాలువలో పడవేయడం జరిగినట్లుగా గుర్తించడమైనది. ఆ వ్యక్తిని అదుపులోనికి తీసుకొని విచారించగా అతనికి విచక్షణ జ్ఞానo పెద్దగా లేనట్లు గుర్తించడం జరిగినది. 


ఆ వ్యక్తిని  గౌరవ కోర్టు వారి ముందు ప్రవేశ పెట్టి వారి యొక్క ఆదేశాల మేరకు ప్రత్యేక వైద్య పరీక్షల నిమిత్తం పంపించేందుకు ఏర్పాట్లు చేయడం జరుగుతుంది.


ఈ సంఘటన జగినప్పటి నుండి ఈ రోజు వరకు SP గారు స్వీయ నిర్దేశంలో దర్యాప్తు బృందాలు నిరంతరం  అందుబాటులో ఉన్న CC కెమెరాల సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకొని అతి తక్కువ సమయంలో ఈ కేసును చేధించడం జరిగింది.

 

త్వరితగతిన వాస్తవాలను వెలికి తీసినటువంటి కాకినాడ DSP Sri. V. Bhima Rao,  1 టౌన్, 2 టౌన్, 3 టౌన్ మరియు సర్పవరం CI లను SP గారు ఈ సందర్భంగా  అభినందించడం జరిగింది.




*Kakinada Sub Division Office, * 

*Kakinada District, The: 06.04.2022. *


*🔹Kakinada District SP Shri M. Rabindranath Babu, IPS., Gary's self-monitoring and the police cracking the case of destruction of stone idols at Annamaghati, Padmanabha Nagar Shri Kanaka Durgamma and Abhayanjaneya Swamy Temple as per the orders issued by him. *


🔹Police identified by CC camera footage as the work of a man with no discernment.


During 04.04.2022 the stone statues of Anjaneya Swami Moola Virat and the Chandi Prachanda idols at the entrance of Kanakadurga were partially destroyed in the temple of Sri Kanaka Durgamma and Abhayanjaneya Swamy in Padmanabha Nagar near Annamaghati under Kakinada I Town Law and Order Police Station. Case filed as Cr.No.63 / 2022 U / s 153 (a) 295, 427 IPC at I Town Police Station on the incident of unidentified persons destroying the head of the Tulsi fort next to the temple and the Dhanya Lakshmi statue on the wall of the temple as well. It is a matter of course for everyone to register and initiate an investigation.


District SP Shri M. Rabindranath Babu, IPS, who took the case very seriously, under the supervision of Kakinada SDPO Shri V. Bhimarao set up special teams with Inspectors of 1st Town, 2nd Town, 3rd Town, Sarpavaram and Port Police Stations in Kakinada town. Following timely instructions and directions, the investigation team went into the field and in a very short time identified the culprit using the testimony of various witnesses and the technology of CC cameras.


*The suspect was in the habit of roaming the area around midnight around 4am on the 4th. From 1.30 p.m. In the meanwhile the crime scene in this case was found wandering around the Sri Kanaka Durga Temple and Abhayanjaneya Swamy Temple where the idols of the deity were destroyed at will with his madness and dumped in the sewer behind the temple. The man was taken into custody and interrogated and it was found that he lacked much discernment. * 


Arrangements will be made for the person to be admitted before the Honorary Court and sent for special medical examination as per their orders.


*Since the incident, SP's self-directed investigation teams have been cracking down on the case in the shortest possible time, using the technology of constantly available CC cameras. *

 

Kakinada DSP Sri. The SP congratulated V. Bhima Rao, 1st Town, 2nd Town, 3rd Town and Sarpavaram CI on the occasion.

Kakinada SmartCity RTO office is under Construction for past 2 years, Causing inconvenience topublic

 Kakinada Smart City RTO office is under Construction for past 2 years, Causing inconvenience to public . This road Work is a long pending , public are put to Toss with construction not being completed for years - no divider makings, no Lighting , no safety.

Even the Replay on Spandana is passive, they say they will complete, years passed, no Development , public are falling and accidents are quite common on this Road. కాకినాడ స్మార్ట్ సిటీలో ఒక రోడ్డు నిర్మాణానికి 2 + సంవత్సరాలా?



Sunday, 7 March 2021

ఇంద్రపాలెం వంతెన వద్ద శ్రమదానం తో గుంతలను పూడ్చిన డి.వై.ఎఫ్.ఐ. కార్యకర్తలు

 ఇంద్రపాలెం వంతెన వద్ద శ్రమదానం తో గుంతలను పూడ్చిన డి.వై.ఎఫ్.ఐ. కార్యకర్తలు....


ఇంద్రపాలెం మీదుగా భారీ వాహనాల రాకపోకలు నిషేధించి, రోడ్ నిర్మించాలని డిమాండ్....


కాకినాడ రూరల్, మార్చి 7; కాకినాడ - జి. మామిడాడ రోడ్ లో ఇంద్రపాలెం వంతెన వద్ద ప్రమాదకరంగా ఉన్న గుంతలను భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) కార్యకర్తలు శ్రమదానం తో శనివారం రాత్రి పూడ్చారు.

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ గ్రామ కార్యదర్శి కట్టా శ్యామ్‌ శేఖర్ మాట్లాడుతూ సామర్లకోట రోడ్ నుండి రామచంద్రాపురం, యానాం రోడ్ ల వైపు వెళ్ళవలసిన భారీ వాహనాలు, టిప్పర్ లు ఇంద్రపాలెం మీదుగా చీడిగ వద్ద నూతనంగా నిర్మిస్తున్న జాతీయ రహదారి 216 కు చేరుకుంటున్నాయని పేర్కొన్నారు. దీనివల్ల ఇంద్రపాలెం గ్రామంలో ట్రాఫిక్ రద్దీ పెరిగిపోయి ప్రమాదాలు జరుగుతున్నాయని, ఇటీవల ఒక మహిళ కూడా మరణించారని ఆందోళన వ్యక్తం చేశారు. భారీ వాహనాలు ఇంద్రపాలెం వంతెన వద్ద మలుపు తీసుకోవడం తో పెద్ద పెద్ద గుంతలు పడి చాలా ప్రమాదకర పరిస్థితులు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. చాలా సార్లు అధికారులకు విన్నవించాక ట్రాఫిక్ పోలీసులను ఏర్పాటు చేసినప్పటికీ వారి డ్యూటీ సమయం లో వెళ్ళే వాహనాలను మళ్ళిస్తున్నారని వచ్చే వాహనాలు ఆగడం లేదన్నారు. అలాగే రాత్రి 9 గం. నుండి ఉదయం 9 గం. ల మధ్యలో వాహనాలు గ్యాస్ హారన్ లతో అత్యంత వేగంగా నడుపుతున్నారని, వీటికి అడ్డు కట్ట వేయాలని అధికారులను కోరుతున్నామన్నారు. అధికారుల నిర్లక్ష్యం వీడి తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. ప్రజల శ్రేయస్సు దృష్ట్యా తమ వంతు గా శ్రమదానం తో గుంతలను పూడ్చుతున్నామని , ఇది తాత్కాలిక పరిష్కారమేనని , శాశ్వత పరిష్కారం చేయాలని కోరుతున్నామన్నారు. లేని పక్షంలో విస్తృత ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

ఈ సందర్భంగా డివైఎఫ్ఐ కృషి ని పలువురు అభినందించారు.

ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ నాయకులు గుండుబోగుల శ్రీనివాస్, కె. సూర్య, సిహెచ్. విజయ్ కుమార్, సిహెచ్. త్రిమూర్తులు,గవర బాబ్జీ, వాసు దొరబాబు, శ్రీనివాస్, వి. రవి కుమార్, రోహిత్, కెవిపిఎస్ కార్యకర్త జి. సత్యానందం, మాజీ సర్పంచ్ పలివెల వీరబాబు తదితరులు పాల్గొన్నారు....







Thursday, 4 March 2021

వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ రమణయ్యపేట లో కొప్పిశెట్టి సురేష్

 వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ      రమణయ్యపేట లో కొప్పిశెట్టి సురేష్ -అనిత దంపతుల సౌజన్యంతో పేద  కుటుంబానికి చెందిన వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మికవేత్త శిరీష మాట్లాడుతూ సృష్టిలో అన్ని జీవులకన్నా  మానవ జన్మ మహోత్కృష్టమైనదని దీనిని సార్థకం చేసుకోవడానికి గాను మానవసేవే మాధవ సేవగా సేవలు అందించాలన్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ ప్రతినిధి జి కృష్ణ మోహన్ మాట్లాడుతూ  సురేష్  అనిత  ల వివాహ దినోత్సవ సందర్భంగా వృద్ధులకు నూతన వస్త్రాలు సమకూర్చడం అభినందనలతో పాటు ఆదర్శనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో  అంతర్జాతీయ వాకర్స్ సంఘ జిల్లా కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్, రేలంగి బాపిరాజు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.