Wednesday, 3 March 2021

చిన్నచిన్న తగాదాలకు విడాకులు తగదు

 చిన్నచిన్న తగాదాలకు విడాకులు తగదు

 సమాజ శ్రేయస్సు దృష్ట్యా చిన్నచిన్న తగాదాలతో భార్య భర్తలు విడాకులు కోరడం తగదని న్యాయవాది పి. ఏసుబాబు పేర్కొన్నారు. లలిత నగర్ కాలనీ లో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన  అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఏమైనా  భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వస్తే...  వాటిని పెద్ద వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి అన్నారు. అలా వీలుకాని పక్షంలో కోర్టులలో ఉండే న్యాయసేవాధికార సంస్థ దృష్టికి తీసుకు వస్తే సామరస్యపూర్వకంగా ఇరువురికి నచ్చజెప్పి తగురీతిలో న్యాయ సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అచట భార్య భర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు పెంపొందడానికి కృషి చేస్తారన్నారు. అంతకు ఇద్దరి మధ్య పరిష్కారం కుదరకపోతే మహిళల తరఫున న్యాయసేవాధికార సంస్థ ఉచితంగా న్యాయ సహాయం అందిస్తుందని యేసు బాబు తెలిపారు. సంఘ అధ్యక్షులు సుబ్రహ్మణ్య రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో  వాకర్స్ ప్రాంతీయ కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్, మురళి ,కే శ్రీ రామ రాజు తదితరులు పాల్గొన్నారు.



త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ను ఐక్య ఉద్యమం కాపాడుకుందాం...

 


త్యాగాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు ను ఐక్య ఉద్యమం కాపాడుకుందాం...

...సిఐటియు విస్తృత సమావేశం పిలుపు...


కాకినాడ, మార్చి 3; ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అశేష ప్రజల పోరాటాలతో , 32 మంది ప్రాణ త్యాగం తో సాధించుకున్న విశాఖ ఉక్కు ను నేటి తరం ఐక్య ఉద్యమం లో కాపాడుకోవాలని సిఐటియు కాకినాడ నగర విస్తృత సమావేశం పిలుపు నిచ్చింది.

బుధవారం సాయంత్రం స్థానిక యుటిఎఫ్ టీచర్స్ హోం లో జి. కామశాస్త్రి అధ్యక్షతన జరిగిన సమావేశంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్ పాల్గొని ప్రసంగించారు. పోరాటాలు, త్యాగాలతో పాటు 68 గ్రామాల ప్రజలు 22 వేల ఎకరాల భూమిని అందించడం వల్ల విశాఖ ఉక్కు సాకారమైందన్నారు. 68 మంది వామపక్షాల ఎమ్మెల్యే లు, ఎంపీలు రాజీనామా లు చేసి పోరాడిన చరిత్ర ఉందన్నారు. సుమారు 2.5 లక్షల కోట్ల విలువైన విశాఖ ఉక్కు పరిశ్రమ ను కొరియా కు చెందిన పోక్సో అనే కంపెనీ కి కారుచౌకగా కట్టబెట్టడానికి కేంద్ర మోడీ ప్రభుత్వం సిద్ధమైందన్నారు. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వకుండా, విభజన హామీలు అమలు చేయకుండా ఇప్పటికే చాలా అన్యాయం చేసారని పేర్కొన్నారు. తాజాగా దేశంలో నవరత్న హోదా కలిగి, లక్షా యాభై వేల మంది కి ప్రత్యక్షం గా పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ను దెబ్బకొడితే చూస్తూ ఊరుకోమన్నారు. దేశరాజధాని లో జరుగుతున్న రైతుల పోరాటం మోడీ దూకుడు కు కళ్ళెం వేసిందన్నారు. ఆ ఉద్యమ స్ఫూర్తి తో విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాటం ప్రభుత్వ రంగ సంస్థల పరిరక్షణ ఉద్యమం గా సాగాలన్నారు. ఈ ఉద్యమం లో సిఐటియు అనుబంధ సంఘాల నాయకులు కార్యకర్తలు ముందు వరుసలో నిలబడాలన్నారు. ప్రజలంతా ఈ ఉద్యమానికి అండగా నిలవాలని, మార్చి 5 రాష్ట్ర బంద్ జయప్రదం చేయాలని పిలుపు ఇచ్చారు. 

సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ మార్చి 14 న జరుగబోతున్న తూర్పు పశ్చిమ గోదావరి ఉపాధ్యాయ నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సాబ్జీ షేక్ గారిని గెలిపించుకోవడానికి కృషి చేద్దామన్నారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా సీనియర్ నేత దువ్వ శేషబాబ్జీ, జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రమళ్ళ పద్మ, జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకట రమణ లతో పాటు సి.వెంకట్రావు, సిహెచ్. విజయ్ కుమార్, ఎం. రమణమ్మ, పద్మ, పాప, భారతి, తుపాకుల వీర్రాజు, గాంధీ, అర్జున్, నవీన్, బంగారు రామకృష్ణ, బండి గోపి, వర్రే రమణ, మహేష్ తదితరులు పాల్గొన్నారు...

విశాఖ ఉక్కు పరిరక్షణ కొరకు 

 రాష్ట్ర బంద్ ను జయప్రదం చేయాలని 

సిపిఐ —ఏఐటీయూసీ ప్రదర్శన 


బంద్ తో మోడీకి గుణపాఠం రావాలి 


సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు 


మార్చి03:విశాఖ ఉక్కు ఆంధ్రుల ఆత్మగౌరవంతో ముడిపడి ఉందని దాని పరిరక్షణ కొరకు బంద్ జయప్రదం చేయాలని అదేవిధంగా విశాఖ ఉక్కు పరిరక్షణ కొరకు కేంద్ర కార్మిక సంఘాలు ఇచ్చిన విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ పిలుపు 5 న జరిగే రాష్ట్ర బంద్కు వామపక్షాలు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు అన్నారు .


బుధవారం ఉదయం రాజమండ్రి లో మెయిన్ రోడ్ లో ప్రదర్శన నిర్వహించారు 


ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ రాష్ట్రంలో గత 20 రోజులుగా విశాఖ ఉక్కు పరిరక్షణ కొరకు  పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్న మోడీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని విమర్శించారు 


 రాష్ట్ర మంత్రి మండలి తీర్మానం చేసిన కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టడం అన్యాయమన్నారు .ఐదు కోట్ల ప్రజల ఆకాంక్ష విశాఖ ఉక్కు అలాంటి విశాఖ ఉక్కు కోసం 32 మంది విద్యార్థుల రక్తతర్పణం తో స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని త్యాగధనులతో నిర్మించిన విశాఖ స్టీల్ ను ప్రైవేటీకరణ చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని అందుకే ఐదో తేదీన జరిగే రాష్ట్ర బంద్ కు వామపక్షాలు పూర్తి మద్దతు ఇస్తున్నాయని జిల్లాలో ఉన్న వర్తక వాణిజ్య విద్యాసంస్థలు థియేటర్స్ పరిశ్రమలు అందరూ సహకరించాలని వారు పిలుపునిచ్చారు .


సిపిఐ నగర కార్యదర్శి నల్ల రామారావు మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రేవిటీకరణ చాల హేయమైన చర్య అని అన్నారు .ప్రేవిటీకరణ ఆపకపోతే మరో చరిత్రతక పోరాటం చేస్తామని అన్నారు .రాష్ట్ర బంద్ కు అన్ని వర్గాల ప్రజలు జయప్రదం చేయాలన్నారు 


జట్ల లేబర్ యూనియన్ అధ్యక్షులు కుండ్రపు రాంబాబు మాట్లాడుతూ ఈ బంద్కు మిగతా రాజకీయ పార్టీ నాయకులు కలిసి రావాలని వారు కోరారు 


ఈ కార్యక్రమం లో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నక్క కిషోర్ ,యూనియన్ ప్రధాన కార్యదర్శి సప్ప రమణ ,ఉపాధ్యక్షులు పెంట దేవుడు ,వెంకట్రావు ,సహాయ కార్యదర్శి రోగుల మోహన్ కృష్ణ ,రెడ్డి వెంకట్ రావు కోశాధికారి కాళ్ళ అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు


ఛాంబర్ అఫ్ కామర్స్ వారు ఉక్కు పరిరక్షణ కొరకు చేస్తున్న రాష్ట్ర బంద్


 ఛాంబర్ అఫ్ కామర్స్ వారు ఉక్కు పరిరక్షణ కొరకు చేస్తున్న రాష్ట్ర బంద్ కు మద్దతు తెలపడాన్ని సిపిఐ జిల్లా కార్యదర్శి తాటిపాక మధు ,ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు నల్ల రామారావు అభినందనలు తెలియచెసారు .కార్మిక వర్గానికి అండగా ఉన్నందుకు వ్యాపార వర్గానికి ధన్యవాదములు వామపక్ష నాయకులూ ,కార్మిక సంఘాలు అన్నారు

తూర్పుగోదావరి జిల్లా కాకినాడ... జిల్లా కలెక్టర్ పి సి పాయిం

 తూర్పుగోదావరి జిల్లా కాకినాడ...

 జిల్లా కలెక్టర్ పి సి పాయింట్స్...


 జిల్లా ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల కమిషనర్ సంతృప్తిని వ్యక్తం చేశారు...


 జిల్లాలోని నాలుగు విడతల్లో 34 వార్డులలో నామినేషన్ లేకపోవడం వలన మరల ఎన్నికల నిర్వహణ నిర్వహిస్తున్నాం...


 6వ తేదీన ఎన్నికల నామినేషన్, 7 వ తేదీన స్కూటీని, 8 వ తేదీన విత్ డ్రాలు, 10 తేదీన  ఎన్నికలు నిర్వహిస్తాం...


 34 వార్డు లో ఇప్పటికే సమాచారాన్ని అందించాం...


 ఉదయం నుండి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహిస్తాం, అదేరోజు సాయంత్రం ఎన్నికలు ఫలితాలు ప్రకటిస్తాం...


 రబీ పంటకు సంబంధించి డిస్టిక్ అడ్వైజరీ బోర్డు లో ఇరిగేషన్, ఆర్డబ్ల్యూఎస్, అగ్రికల్చర్ సంబంధిత అధికారులతో ప్రతివారం సమావేశం నిర్వహిస్తున్నాం...


 రైతుల లో ఉన్న అపోహలు తొలగించేందుకే ఫీల్డ్ విజిట్ లు చేస్తున్నాం...




 జాయింట్ కలెక్టర్ కీర్తి చేకూరి పి సీ పాయింట్..


 మొదటి విడతలో కోవిడ్ వ్యాక్సినేషన్ హెల్త్ కేర్ డిపార్ట్మెంట్ లకు, రెండో విడతలో రెవెన్యూ, పోలీసులకు, మూడో విడతలో ప్రజలకు అందుబాటులో ఉంచేందుకు ఆరోగ్యశ్రీ ఉన్న ప్రతి ప్రైవేటు ఆసుపత్రులలో  250 రూపాయలు కట్టి వ్యాక్సినేషన్ వేయించుకోవచ్చు...


 జనరల్గా కాకుండా covid-19 వెబ్సైట్లో కూడా   రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చని తెలిపారు....


 45 నుండి 60 సంవత్సరాల లోపు ఉన్న వారు ప్రతి ఒక్కరు వారికి ఉన్న ఇబ్బందులను డాక్టర్లు చెప్పి వ్యాక్సిన్ వేయించుకోవాలి....


 65 సంవత్సరాల పైబడిన వారు ప్రతి ఒక్కరూ ఏదైనా గుర్తింపు పొందిన కార్డు పట్టుకొని వెళ్ళవలెను...


East Godavari joint Collector(W) Smt G. Raja Kumari, I. A. S., Inspected 1) Gram Sachivalayam 1, 2 and 3 of Vetlapalem (V), Samalkot (M)

 East Godavari joint Collector(W) Smt G. Raja Kumari, I. A. S., 

Inspected

1) Gram Sachivalayam 1, 2 and 3 of Vetlapalem (V), Samalkot (M) Today, Conducted Review on Beyond SLA services, YSR Bima, Aasara, Cheyutha, etc., Interacted with Sachivalayam Functionaries. 

2) Visited to SBI, Vetlapalem along with PD, DRDA, JD Animal Husbandry & staff and Verified the Milch Animals Loaning process at Bank under YSR Cheyutha



Joint Collector(W) Smt G. Raja Kumari, I. A. S., madam inspected APSWRS Social Welfare Res School at Pithapuram


Joint Collector(W) Smt G. Raja Kumari, I. A. S., madam inspected APSWRS Social Welfare Res School at Pithapuram.. Interacted with Students, Observed Facilities, Had lunch with Students on 02-03-2021. Tahsildar, Principal and RI Pithapuram attended. #APSWRSSocialWelfare  #APSWRS #socialwelfare  #pithapuram #rajakumari 

#jointcollectorrajakumari 

#jointcollector  #eastgodvaricollector #eastgodavari #ripithapuram #eastgodavaridist