నాణ్యమైన ఆహారాన్ని తీసుకోవాలి మనం ఎంత సంపాదిస్తున్నా మనే దానికన్నా ఎంత నాణ్యమైన ఆహారాన్ని తీసుకుంటున్నాము అనేది ముఖ్యమని వ్యాయామ శిక్షకులు పీ త్రినాథ్ పేర్కొన్నారు. రమణయ్యపేట లో బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం క్రమంగా పెరిగిందన్నారు. దీంతో మనం మందుల్ని పల్లెల్లో పెట్టుకొని తింటున్నట్లు అని అన్నారు .రోగనిరోధకశక్తిని కలిగి ఉండడానికి ప్రకృతి సేద్యం పద్ధతి లో పండించిన ఆహారపదార్ధాలు అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, రాజా, సుబ్రహ్మణ్యం, బాపిరాజు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
Sunday, 7 March 2021
రాష్ట్ర స్థాయి షూటింగ్ కు కాకినాడ అమ్మాయి ఎంపిక లోకజ్ఞాను అభినందించిన కాకినాడ కమిషనర్ స్వప్నిల్ దినకర్
రాష్ట్ర స్థాయి షూటింగ్ కు కాకినాడ అమ్మాయి ఎంపిక
లోకజ్ఞాను అభినందించిన కాకినాడ కమిషనర్ స్వప్నిల్ దినకర్
తూర్పుగోదావరి జిల్లా కాకినాడ... రాష్ట్ర స్థాయి షూటింగ్ కు క్రీడాకారులను ఎంపిక చేసినట్లు ఆంధ్రప్రదేశ్ రైఫిల్ అసోసియేషన్ కార్యదర్శి డి.రాజ్ కుమార్ తెలిపారు. గత నెల 24 నుంచి 27 వ తేదీ వరకు హైదరాబాద్లోని అంతర్జాతీయ షూటింగ్ రేంజ్ లో ఆంధ్రప్రదేశ్ అంతర్ జిల్లాల రైఫిల్ , ఎయిర్ పిస్తోల్ పోటీలు నిర్వహించినట్లు చెప్పారు. ఉమెన్ యూత్ జూనియర్ కేటగిరీలో తూర్పుగోదావరి జిల్లా కాకినాడకు చెందిన వంక.లోకజ్ఞ కాంస్యం పతకం సాధించి జిల్లాకు మంచిపేరు తీసుకురావడం గర్వకారణమని కాకినాడ మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ అభినందించారు. త్వరలో తమిళనాడులో జరగబోయే అంతర్రాష్ట్ర పోటీలకు జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న లోకజ్ఞ బంగారు పతకం సాధించాలని కమీషనర్ కొనియాడారు.
Friday, 5 March 2021
కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో బంద్ చేయిస్తున్న సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ
కాకినాడ రూరల్ మండలం ఇంద్రపాలెం గ్రామంలో బంద్ చేయిస్తున్న సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ ల నాయకులు..... ఎన్నో త్యాగాలు, పోరాటాలతో సాధించుకున్న విశాఖ ఉక్కు పరిశ్రమ ను నేటి తరం ఉద్యమాలతో కాపాడుకోవాలని పిలుపు.... విశాఖ ఉక్కు పరిశ్రమ కు సొంత ఘనులు కేటాయించాలని డిమాండ్.... ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తూ దేశ సంపద ను కార్పొరేట్ లకు దోచిపెడుతున్న బిజెపి మోడీ విధానాలను ప్రజలంతా వ్యతిరేకించాలని, ఆంధ్రప్రదేశ్ కు అన్యాయం చేస్తున్న కేంద్ర పాలకులకు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపు.....ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు సిహెచ్. విజయ్ కుమార్, గుండుబోగుల శ్రీనివాస్, వాసంశెట్టి చంద్రరావు, ఆమ్ ఆద్మీ నాయకులు నరాల శివ, కృష్ణ మోహన్, సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు...
Free Driving Training to Women by Red cross Society
Dist Collector Sri D.Muralidhar reddy inaugurated the Free Driving Training to Women by Red cross Society with the support of ONGC and distributed Silver Medals and Awards to Officials and Junior/ Youth Redcross Volunteers at Red cross Bhavan, Gandhi Nagar, Kakinada on 05-03-2021. Red Cross Chairman YD Ramarao and others participated.
570 స్థానాల్లో వైకాపా.. 5 చోట్ల తెదేపా ఏకగ్రీవం: ఎస్ఈసీ. Elecion news update
570 స్థానాల్లో వైకాపా.. 5 చోట్ల తెదేపా ఏకగ్రీవం: ఎస్ఈసీ.
నగర పాలక, పురపాలిక, నగర పంచాయతీల్లోని ఏకగ్రీవాలను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
మొత్తం 2,794 వార్డుల్లో 578 ఏకగ్రీవమయ్యాయని వెల్లడించింది....
నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం పూర్తయిన నేపథ్యంలో... నగరపాలక, పుర, నగర పంచాయతీల్లోని ఏకగ్రీవాలను ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో మొత్తం 2,794 వార్డుల్లో 578 ఏకగ్రీవమయ్యాయని వెల్లడించింది. రాష్ట్ర వ్యాప్తంగా 20.68 శాతం వార్డులు ఏకగ్రీవం కాగా వైకాపా అత్యధిక స్థానాలు దక్కించుకుందని ఎస్ఈసీ వివరించింది.
అధికార పార్టీ జోరు .
వైకాపా 570 స్థానాల్లో పాగా వేయగా తెదేపా ఐదు స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. ఒక చోట భాజపా, రెండు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఎస్ఈసీ తెలిపింది..
వ్యాక్సిన్ తోనే కరోనా వైరస్ నివారణ
వ్యాక్సిన్ తోనే కరోనా వైరస్ నివారణ
కరోనా వైరస్ ను పూర్తిగా నిర్మూలించేందుకు ఒక్క వైరస్ తోనే సాధ్యమని డాక్టర్ అడ్డాల సత్యనారాయణ పేర్కొన్నారు. సర్పవరం జంక్షన్ లో బోట్ క్లబ్ వాకర్స్ సంగం ఆధ్వర్యంలో జరిగిన అవగాహన కార్యక్రమం ఉద్దేశించి ఆయన మాట్లాడారు. గతంలో కరోనా వైరస్ నియంత్రణకు వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూశామని కానీ నేడు అందుబాటులోకి వచ్చిన తర్వాత మీనమేషాలు లెక్కించడం తగదన్నారు . వ్యాక్సిన్ వేయించుకోవడం వలన యాంటీ బాడీస్ వృద్ధిచెందుతాయి అన్నారు. 60 ఏళ్లు పైబడిన వారికి ప్రభుత్వాసుపత్రిలో ఉచితంగా వ్యాక్సిన్ వేస్తున్నారని అన్నారు. ప్రైవేట్ ఆస్పత్రిలో రూ. 250 లు చెల్లించాల్సి ఉందన్నారు. వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత కూడా ప్రతి ఒక్కరూ విధిగా మాస్కు ధరించాలి అని భౌతిక దూరం పాటించాలని డాక్టర్ సత్యనారాయణ తెలిపారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్న ప్రసాద్, బాపిరాజు, రాఘవరావు తదితరులు పాల్గొన్నారు.
Kakinada Bandh March 5 Against Steel Plant Privatization
కాకినాడ భానుగుడి సెంటర్ లో బంద్ ర్యాలీ దృశ్యం.....