Wednesday, 3 March 2021

జులై 12 నుంచి ఎంసెట్‌AP EAMCET 2021 - Exam Date

 జులై 12 నుంచి  ఎంసెట్‌


బైపీసీ స్ట్రీమ్‌ 19, 20 తేదీల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం

* అమరావతి:*

 ఏపీ ఎంసెట్‌ జులై 12 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లు, పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఎంసెట్‌ నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూ కాకినాడకు అప్పగించారు. జులై 12 నుంచి 15 వరకు ఇంజినీరింగ్‌ పరీక్షను నిర్వహిస్తారు. నాలుగు రోజులపాటు 8 విడతలుగా పరీక్ష ఉంటుంది. బైపీసీ స్ట్రీమ్‌ విద్యార్థులకు 19, 20వ తేదీల్లో 2 రోజులపాటు నాలుగు విడతలుగా పరీక్ష నిర్వహిస్తారు. దీని తర్వాత ఈసెట్‌ నిర్వహించనున్నారు. పాలిటెక్నిక్‌ పరీక్షల తేదీలు ఖరారు కానందున ఈ తేదీలపై ఇంకా స్పష్టత రాలేదు. చివరి సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూలును పంపించాలని సాంకేతిక విద్యాశాఖను ఉన్నత విద్యామండలి కోరింది.


మిగతా పరీక్షల్లో కొంత జాప్యం

ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనందున ఆగస్టు 6 వరకు డిగ్రీ విద్యార్థులకు తరగతులను నిర్వహించనున్నారు. అనంతరం సెమిస్టర్‌ పరీక్షలుంటాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ పరీక్షల షెడ్యూలును అనుసరించి ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబరు మొదటి వారం నుంచి ఐసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌ లాంటివి నిర్వహించనున్నారు. డిగ్రీ పరీక్షల ఫలితాల అనంతరం కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. ఆగస్టులో సెమిస్టర్‌ పరీక్షలు పూర్తయినా ఫలితాలు వచ్చేందుకు నెల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో అక్టోబరులో కౌన్సెలింగ్‌ నిర్వహించాలని భావిస్తున్నారు.


ఆంధ్ర వర్సిటీకి మూడు సెట్‌ల బాధ్యతలు

ఎంసెట్‌ కన్వీనర్‌గా జేఎన్‌టీయూ కాకినాడ ప్రొఫెసర్‌ రవీంద్రను రెండోసారి నియమించారు. మొత్తం ఏడు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఉండగా, 3 ప్రవేశ పరీక్షల బాధ్యతలను ఆంధ్ర వర్సిటీకి అప్పగించారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఛైర్మన్లుగా వ్యవహరించనున్నారు.

Dist Collector D.Muralidhar Reddy @ Sachavalayam Staff at Golilla Peta, Jagannaickpur, Kakinada

 Dist Collector D.Muralidhar Reddy inspected 14A-14B Ward m on service requests,  Register books and interacted  Sachavalayam Staff at Golilla Peta, Jagannaickpur, Kakinada on 03-03-2021. Kkd Municipal commissioner and MHO participated. #Municipalcommissioner  #kakinda #kakinadmucipalcorporation #distcollector #DMuralidhar Reddy #CollectorDMuralidharReddy #SachavalayamStaff #Sachavalayam  #kkdmuncipal 




టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక..

 టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ నూతన కమిటీ ఎన్నిక...


కాకినాడ, మార్చి 2; ది. కాకినాడ టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ (సిఐటియు అనుబంధం) నూతన కమిటీ ఎన్నిక జరిగింది.

మంగళవారం ఉదయం స్ధానిక సిఐటియు కార్యాలయం లో యూనియన్ సర్వసభ్య సమావేశం వాలిశెట్టి శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. యూనియన్ కార్యదర్శి పి. రమేష్ గత కార్యక్రమాలు ప్రవేశ పెట్టారు.  ఈ సందర్భంగా సిఐటియు నగర అధ్యక్షుడు పలివెల వీరబాబు మాట్లాడుతూ టాటా మ్యాజిక్ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ యూనియన్ కరోనా లాక్ డౌన్ సమయంలో తొలి సారిగా తమ సభ్యులను ఆదుకొనే కార్యక్రమం చేసిందన్నారు. కేంద్ర ప్రభుత్వం మోటారు వాహన సవరణ చట్టం తెచ్చి ట్రాన్స్ పోర్ట్ రంగాన్ని నిర్వీర్యం చేస్తుందన్నారు. దాని వల్ల భారీగా చలానా ఫీజులు, అపరాధ రుసుములు వేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒకే దేశం ఒకే పన్ను పేరుతో మందులను కూడా జి.ఎస్.టి.పరిధి లోకి తెచ్చిన కేంద్ర పాలకులు పెట్రోల్ డీజిల్ లను ఎందుకు జి.ఎస్.టి. పరిధిలోకి తీసుకురాలేదని ప్రశ్నించారు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే రాష్ట్రంలో ఎక్కడ చూసినా రోడ్లు అస్తవ్యస్తంగా ఉన్నాయని, దీనివల్ల ట్రాన్స్ పోర్ట్ వాహనాలు తరచూ రిపేర్ కు వస్తున్నాయని పేర్కొన్నారు. మరొకవైపు స్పేర్ పార్ట్ ల ధరలు విపరీతంగా పెరిగాయన్నారు. దీనివల్ల ట్రాన్స్ పోర్ట్ కార్మికుల జీవనం భారంగా మారుతోందన్నారు. అందువల్ల పాలకులు, అధికారులు ట్రాన్స్ పోర్ట్ రంగ కార్మికులపై భారాలు మోపే విధానాలు ఆపాలని డిమాండ్ చేస్తున్నామన్నారు.

ఈ సందర్భంగా కర్రి శ్రీనివాస్ అధ్యక్షుడు గా, శీలి లక్ష్మణ్ ఉపాధ్యక్షుడు గా, కె. వీరబాబు కార్యదర్శి గా, ప్రేమ్ కుమార్ సహాయ కార్యదర్శి గా, హేమ కుమార్ కోశాధికారి గా నూతన కమిటీ ఎన్నిక అయ్యింది. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యుడు మేడిశెట్టి వెంకట రమణ, కె. సత్తిబాబు లతో పాటు బాబూరావు, రాఘవ, మూర్తి, భాషా తదితరులు పాల్గొన్నారు...'''












సెల్ఫోన్లతో వినికిడి సమస్యలు ఈ రోజుల్లో - ప్రముఖ ఈ ఎన్ టి వైద్యులు డాక్టర్ గుబ్బల లక్షణ ప్రసాద్

 సెల్ఫోన్లతో వినికిడి సమస్యలు ఈ రోజుల్లో సెల్ ఫోన్ వాడని వారు లేరంటే అతిశయోక్తి కాదని కానీ వీటి వలనే రోజు రోజుకి వినికిడి సమస్యలు అధికమవుతున్నాయి  అని ప్రముఖ   ఈ ఎన్ టి వైద్యులు డాక్టర్ గుబ్బల లక్షణ  ప్రసాద్ పేర్కొన్నారు. రమణయ్యపేట ఆదర్శ వృద్ధుల ఆశ్రమంలో  బోట్ క్లబ్ వాకర్స్ సంగం ఆధ్వర్యంలో ప్రపంచ వినికిడి దినోత్సవాన్ని పురస్కరించుకొని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. శక్తివంతమైన స్మార్ట్ఫోన్లలో ఎక్కువ సేపు మాట్లాడటం వలన వాటినుండి   అధిక రేడియేషన్ విడుదలై వినికిడి లోపం వస్తుందన్నారు. ఆధునిక జీవనశైలి ,పోషకాహార లోపం, మానసిక ఒత్తిళ్లు కూడా వినికిడి పై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. దీని నివారణకు గాను ఎక్కువ సమయం సెల్ఫోన్లలో  మాట్లాడ రాదన్నారు. చెవిలో నూనె వేయడం , ఇతర వస్తువులు పెట్టి  చెవిలో తిప్ప రాదని డాక్టర్ లక్ష్మణ్ ప్రసాద్ తెలిపారు. అనంతరం హియరింగ్ కేర్ సెంటర్ ఆడియాలజిస్టు ఎన్ శ్రీను నాయక్ వినికిడి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ వాకర్స్ సంఘ జిల్లా కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్ ఆధ్వర్యంలో డాక్టర్ గుబ్బల లక్ష్మన్న ప్రసాద్ , ఎన్ శ్రీను నాయక్ లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రేలింగి బాపిరాజు, డి సుబ్రహ్మణ్యం, రాజా, పీ. త్రినాథ్, శ్రీ వాణి, కొండలరావు తదితరులు పాల్గొన్నారు .



#ent #entdr #entdrkakinada #kakinada #kainadanews

జాతీయ నులుపురుగుల నివారణక దినోత్సవం




ఈ రోజు   నివారణ నిమిత్తం 1సంవత్సరం నుండి 19 సంవత్సరం లలోపు పిల్లల కు మాత్రలు పంపిణీ చేసిన రాష్ట్ర కార్యదర్శి లింగంరవి ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు ANM హేమ వారి సిబ్బంది వారితో పాటుగా జిల్లా బిసి సెల్ కార్యదర్శి కొత్తపల్లి గిరీష్ పంచాయతీ కార్యదర్శి వెంకట రెడ్డి గారు తదితర నాయకులు #kakianda #kakinadacity #kakinadanews #kainadanewsupdates #doctorsadvice #kakinadadoctor #news  #ratnaprasadkakinada


 చిగుళ్ల వ్యాధి ని అశ్రద్ధ చేయరాదు  మనం తీసుకునే ఆహారం జీర్ణం కావాలంటే దంతాలు ముఖ్యం కాబట్టి చిగుళ్ల వ్యాధి వస్తే  వెంటనే వైద్యుల్ని సంప్రదించి సహజ దంతాలను కాపాడుకోవాలని ప్రముఖ దంత వైద్యులు డాక్టర్  సువర్ణ రాజు పేర్కొన్నారు. సర్పవరం గ్రామంలో ఆ గ్రామ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన  ఆరోగ్య అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మెనోపాజ్ దశలో  మహిళలను చిగుళ్ల సమస్యలు వేధిస్తాయి అన్నారు. ఈ దశలో ఈస్ట్రోజన్ అనే హార్మోన్ తక్కువ స్థాయిలో విడుదలవుతుందని తద్వారా నోరు పొడిబారి దుర్వాసన వస్తుంది అన్నారు. దీనిని అధిగమించడానికి ప్రతిరోజు రెండుసార్లు బ్రష్ చేయాలని  డాక్టర్ సువర్ణ రాజు తెలిపారు.   సంఘ అధ్యక్షుడు బండి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వాకర్స్ ప్రాంతీయ కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్, సంఘ సభ్యులు, వాకర్స్ పాల్గొన్నారు


#kakianda #kakinadacity #kakinadanews #kainadanewsupdates #doctorsadvice #kakinadadoctor #news  #ratnaprasadkakinada

ప్రముఖ మానసిక విశ్లేషకులు డాక్టర్ ఏ పి జి విను - Happiness is the key for Success - Psychologist A PJ Vinu @ NSS Camp

 ప్రతినిత్యం ఆనందంగా గడపాలి ప్రతి ఒక్కరూ ప్రతి నిమిషం ఆనందంగా, సంతోషంగా గడపడానికి ప్రయత్నించాలని  ప్రముఖ మానసిక విశ్లేషకులు డాక్టర్  ఏ పి జి విను పేర్కొన్నారు. రమణయ్యపేట కొత్తూరు లో స్వామి జూనియర్ కళాశాల ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక  శిబిరాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. మనిషి జీవితంలో ప్రతిక్షణం విలువైనది అన్నారు. జీవితంలో సమస్యలు సహజమని అయితే ఆనందమే జీవిత పరమావధి కాబట్టి విద్యార్థి దశలో చక్కగా విద్య అభ్యసిస్తూ కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో ప్రేమ, ఆప్యాయతను పంచుకుంటూ ఆనందంగా జీవించాలని  అన్నారు. చదువును కష్టంగా కాకుండా  ఇష్టంగా చదవాలన్నారు. వ్యతిరేక ఆలోచనలు రానివ్వకుండా ఎప్పుడు సానుకూల దృక్పథంతో మెలగాలని విను తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రాజకుమార్, మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్, ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రాం అధికారి , వాలంటీర్లు పాల్గొన్నారు.



#kakianda #kakinadacity #kakinadanews #kainadanewsupdates #nssunit #nssswamycollege #nssnews #psychologistapjvinu #vinu #apjvinu #ratnaprasadkakinada