Thursday, 4 March 2021

విశాఖ ఉక్కు ని ప్రయివేటికరణ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా

విశాఖ ఉక్కు ని ప్రయివేటికరణ వ్యతిరేక ఉద్యమంలో భాగంగా

రేపు మార్చి 05న *రాష్ట్రబంద్ కి మద్దతుగా విశాఖ ఉక్కు JAC కాకినాడ కూడా పాల్గొని మద్దతు తెలిపెందుకు తీర్మానించింది కావున రేపు మనం అందరం ఇంద్రపాలెం బ్రిడ్జి వద్ద ఉదయం 09:00గం"లకు **రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్  డాక్టర్ BR అంబెడ్కర్ గారి విగ్రహానికి పులా మాలలు వేసి నివాళి అర్పించిన**  తరువాత బంద్ లో పాల్గొని విజయవంతం చేయాలన కోరుతున్నాం.


ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించు వారు.


JAC కన్వీనర్, SC ST మానిటరింగ్ అండ్ విజిలెన్స్ జిల్లా సభ్యులు అయిత బత్తుల రామేస్వర రావు గారు


కో- కన్వీనర్ , ముస్లిం ఆలోచన పరుల వేదిక నాయకులు 

హసన్ షరీఫ్ గారు


దళిత బహుజన గిరిజన ఐక్యవేదిక నాయకులు గూడాల కృష్ణ గారు


యునైటెడ్ SC ST ఫోరమ్ నాయకులు తుమ్మల నూకరాజు గారు


INTUC నాయకులు ఫనీశ్వర్ రావు గారు


భీమ్ ఆర్మీ రాష్ట్ర అధ్యక్షులు పిల్లి శివ గారు


ఆంధ్ర మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షలు సిద్ధాంతాల కొండబాబు గారు


దళిత బహుజన ఫ్రంట్ నాయకులు చెంగల రావు గారు


బహుజన సమాజ్ వాదీ పార్టీ నగర అధ్యక్షులు సుబ్బారాపు అప్పారావు గారు


జన చైతన్య మండలి అధ్యక్షులు పావన ప్రసాద్ గారు


AIFTU నాయకులు R.సతీష్ గారు


ముస్లిం అద్వకేట్స్ అసోసియేషన్ నాయకులు జవహర్ ఆలీ గారు


రిపబ్లిక్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పిట్టా వరప్రసాద్ గారు


దళిత సత్తా అధ్యక్షులు కామేశ్వరరావు గారు


మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు షేక్ హుస్సేన్ గారు


విశాఖ ఉక్కుని ప్రయివేటికరణను ఖండిస్తు ప్రకటన విడుదల చేసిన కాకినాడ న్యాయవాదుల సంఘం.

 విశాఖ ఉక్కుని ప్రయివేటికరణను ఖండిస్తు ప్రకటన విడుదల చేసిన కాకినాడ న్యాయవాదుల సంఘం.

పత్రికా ప్రకటన బార్ అసోసియేషన్ జిల్లా కోర్ట్ పరిధి 4.3.21,కాకినాడ.


విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేడు కాకినాడ బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి బాల సుభ్రమణ్యం గారిని కలిసి రేపు జరుపుతున్న రాష్ట్ర బంద్ కి మద్దతు కోరగా ఆయన సంఘీభావం తెలిపారు, విశాఖ ఉక్కుని కాపాడుకునే భాద్యత అందరికి ఉందని పాఠశాల విద్యార్థిగా ఉన్నపుడే విశాఖ ఉక్కు కోసం విశాఖపట్నం లో ఉద్యమంలో నేరుగా పాల్గున్న విషయాన్ని గుర్తు చేశారు,న్యాయవాదులు మాజీ కార్యదర్శి ఎజాజుద్దీన్, సయ్యద్ సాలర్,ఇమామ్ మోహిద్దీన్,దౌరుల ఉదయ శంకర్,కొండేపూడి ఉదయ్ కుమార్,చక్రవర్తి,k. శ్రీనివాస్,సుధీర్ తదితర న్యాయవాదులు అందరు బంద్ కి సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో కో కన్వీనర్ హసన్ షరీఫ్, ట్రెజరర్ ర్.సతీష్, INTUC నాయకులు ఫణిశ్వర్ రావు తదితరులు పాల్గున్నారు.




ఏలేశ్వరం NH 16 వ నెంబరు జాతీయ రహదారి లో గొర్రెల మంద పై దూసుకెళ్లిన వాహనం

 ఏలేశ్వరం NH 16 వ నెంబరు  జాతీయ రహదారి లో గొర్రెల మంద పై దూసుకెళ్లిన వాహనం


కొట్టి ఈపు అప్పారావు అక్కడికక్కడే మృతి 


12 గొర్రెలు మృతి 2 లక్షల రూపాయలు ఆస్తి నష్టం..  


ఈపు అప్పారావు ది కిర్లంపూడి  మండలం సింహాద్రిపురంగా గుర్తించిన పోలీసులు

నేత్ర దానం పై కరపత్రాలు పంపిణీ

 నేత్ర దానం పై కరపత్రాలు పంపిణీ రమణయ్యపేట కొత్తూరు లో స్వామి జూనియర్ కళాశాల    ఎన్ ఎస్ ఎస్ ప్రత్యేక శిబిరంలో భాగంగా వాలంటీర్లు నేత్ర దానం పై కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ రాజ్ కుమార్  మా ట్లాడుతూ జీవించినంత కాలం కంటి చూపును   అనుభవించాం కాబట్టి  మరణానంతరం నేత్రదానం చేయడం వలన మరో ఇద్దరికీ కంటిచూపును ప్రసా దించినట్లు       కాబట్టి ప్రతి ఒక్కరూ నేత్రదానం చేయాలన్నారు. ఏ వయసు వారైనా  నేత్రదానం చేయవచ్చన్నారు.    మధుమేహం, బిపి ఉన్న వారితో పాటు క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయించుకున్న వారు కూడా నేత్రదానం చేయవచ్చని రాజ్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ అడబాల రత్న ప్రసాద్, జి కృష్ణ మోహన్, ఎన్ ఎస్ ఎస్ అధికారి,   వాలంటీర్లు పాల్గొన్నారు



ఆడపిల్ల దేశానికి గర్వకారణం


స్త్రీ పురుష సమానత్వం తోనే సమాజం సంపూర్ణ శాస్త్రీయ అభివృద్ధి సాధిస్తుందని  ఇందుకుగాను ప్రతి ఒక్కరూ మహిళలను  గౌరవించాలని నారాయణ సేవ   అధ్యక్షురాలు ఎం. వరలక్ష్మి పేర్కొన్నారు. రమణయ్యపేట లో  బోట్ క్లబ్ వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళ   వారోత్సవాలను పురస్కరించుకొని జరిగిన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు .మహిళలు అన్ని రంగాలలో సమానంగా రాణించాలంటే తమ హక్కులను కాపాడుకుంటూ విధాన నిర్ణయాల్లో పాలుపంచుకోవాలని వరలక్ష్మి తెలిపారు. అంతర్జాతీయ వాకర్స్ సంఘ జిల్లా కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్ మాట్లాడుతూ స్థానిక సంస్థల పదవుల్లో  మహిళలకు గతంలో 33శాతం రిజర్వేషన్ ఉండేదని కానీ నేడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  50శాతానికి రిజర్వేషన్ పెంచి మహిళలకు ప్రజా సేవ చేసే   అవకాశం కల్పించి నందున వాటిని సద్వినియోగం చేసుకొని మంచి పేరు ప్రఖ్యాతలు పొందాలన్నారు .   అనంతరం  అడబాల ఆధ్వర్యంలో పత్రికా రంగంలో విలేకరిగా సేవలందిస్తున్న నందిని ని, సేవారంగంలో విస్తృతంగా  సేవలందిస్తున్న ఎం. వరలక్ష్మి, పివి  రాజేశ్వరి  లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జి కృష్ణ మోహన్, రేలింగి బాపిరాజు,  డి సుబ్రమణ్యం, రాఘవ  రావు  , సత్యనారాయణ, అన్నపూర్ణ తదితరులు పాల్గొన్నారు.

Wednesday, 3 March 2021

కమ్యూనిస్టుల గెలుపు అభివృద్ధికి మలుపు


కమ్యూనిస్టుల గెలుపు అభివృద్ధికి మలుపు 


. సిపిఐ రాష్ట్ర  కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య పిలుపు.  


సామర్లకోట మార్చి 4 :ఒక్క ఓటు కమ్యూనిస్టు పార్టీకి వేయడం ద్వారా స్వచ్ఛమైన పాలనకు అభివృద్ధికి అభివృద్ధికి మలుపు గా ఉంటుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రావుల వెంకయ్య పిలుపునిచ్చారు గురువారం ఉదయం స్థానిక పదో వార్డు లో సప్త సూర్య  రామ కుమారి కి మద్దతుగా ఆయన  ఇంటింటికి తిరుగుతూ ప్రచారం నిర్వహించారు. ఆయనతో పాటు సిపిఐ జిల్లా ప్రధాన కార్యదర్శి తాటిపాక మధు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు నక్క కిషోర్  జి లోవ రత్నం సామర్లకోట పట్టణ కార్యదర్శి పేదిరెడ్ల సత్యనారాయణ ఉన్నారు. ఈ సందర్భంగా రావుల వెంకయ్య మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో సిపిఐ గెలుపు అంటే ప్రజాస్వామ్యానికి గెలుపుని రాష్ట్రంలో అరాచక పాలన కొనసాగుతుందని ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాలరాస్తున్నారని వర్గ వైరుధ్యాలతో స్థానిక సంస్థల్లో బలవంతపు నామినేషన్ల ఉపసంహరణ కొన్నిచోట్ల గెలుపు కోసం సారా,  డబ్బు యథేచ్ఛగా మంచినీళ్ల ప్రాయంగా ఖర్చు పెడుతున్నారని ప్రజాస్వామ్యాన్ని ప్రజా సమస్యలను పూర్తిగా గాలికి వదిలేస్తున్నారని ప్రజా సమస్యలు పరిష్కారం కావాలంటే కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థుల గెలుపు అనివార్యమని అటువంటి కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను కంకి కొడవలి గుర్తు పై ఓటు వేసి గెలిపించ వలసిందిగా మున్సిపాలిటీలో తమ వాణిని వినిపించేందుకు గాను కమ్యూనిస్టు అభ్యర్థిని సూర్యకుమారి గారికి కంకి కొడవలి ఓటు వేయడం ద్వారా మున్సిపాలిటీ లో అవకాశం కల్పించాలని సిపిఐ పార్టీ తరఫున ప్రజలందరినీ అభ్యర్థిస్తున్నాము. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు ఎలిశెట్టి రామదాసు, ఏఐటీయూసీ నాయకులు కామిరెడ్డి బోడకొండ, ప్రజానాట్యమండలి కళాకారులు పేదిరెడ్ల అర్జున్ రావు, అల్లూరు భద్�

చిన్నచిన్న తగాదాలకు విడాకులు తగదు

 చిన్నచిన్న తగాదాలకు విడాకులు తగదు

 సమాజ శ్రేయస్సు దృష్ట్యా చిన్నచిన్న తగాదాలతో భార్య భర్తలు విడాకులు కోరడం తగదని న్యాయవాది పి. ఏసుబాబు పేర్కొన్నారు. లలిత నగర్ కాలనీ లో వాకర్స్ సంఘం ఆధ్వర్యంలో జరిగిన  అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. ఏమైనా  భార్య భర్తల మధ్య మనస్పర్ధలు వస్తే...  వాటిని పెద్ద వారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలి అన్నారు. అలా వీలుకాని పక్షంలో కోర్టులలో ఉండే న్యాయసేవాధికార సంస్థ దృష్టికి తీసుకు వస్తే సామరస్యపూర్వకంగా ఇరువురికి నచ్చజెప్పి తగురీతిలో న్యాయ సలహాలు ఇవ్వడం జరుగుతుందన్నారు. అచట భార్య భర్తల మధ్య సంబంధ బాంధవ్యాలు పెంపొందడానికి కృషి చేస్తారన్నారు. అంతకు ఇద్దరి మధ్య పరిష్కారం కుదరకపోతే మహిళల తరఫున న్యాయసేవాధికార సంస్థ ఉచితంగా న్యాయ సహాయం అందిస్తుందని యేసు బాబు తెలిపారు. సంఘ అధ్యక్షులు సుబ్రహ్మణ్య రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో  వాకర్స్ ప్రాంతీయ కౌన్సిలర్ అడబాల రత్న ప్రసాద్, మురళి ,కే శ్రీ రామ రాజు తదితరులు పాల్గొన్నారు.